COLUMN: నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం ఇప్పించేందుకు తాపవూతయపడ్డ ఒక మహా మనిషి. ఆయనే సీ పద్మనాభడ్డి. ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంఘా’నికి 20 ఏండ్లు అధ్యక్షునిగా కొనసాగారు. అంతకుముందు డెమోక్షికటిక్ లాయర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షునిగా ఉండేవారు. అనంతపూర్ జిల్లా యాడికిలో మధ్యతరగతి కుటుంబంలో 1931 మార్చి 1న జన్మించిన పద్మనాభడ్డి మద్రాసు హైకోర్టులో 1953 జూలై 27న న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గుంటూరులోని హైకోర్టులో, అలాగే 1956 నుంచి హైదరాబాద్ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. దేశంలోనే మంచి పేరు గడించిన క్రిమినల్ లాయర్లలో పద్మనాభడ్డిది ప్రత్యే క స్థానం. అలాంటి పద్మనాభడ్డి చాలాకాలంగా అనారోగ్యంతో ఆగస్టు 4 ఆదివారం హైదరాబాద్‌లో తన 2వ ఏట గుండెపోటు తో మరణించారు. ఆయన ఏకైక సంతానం తనయుడు జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం హైకోర్టు జడ్జిగా ఉన్నారు. 


దేశంలో అతిపెద్ద కుట్ర కేసులుగా చలామణి అయిన పార్వతీపురం కుట్ర కేసు, సికింవూదాబాద్ కుట్ర కేసులలో ఆయన వాదించారు. ఈ కేసులు అబద్ధపు కేసులని రుజువుచేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాలకు పెద్ద అండగా నిరుపేదలకు ఆత్మస్థైర్యం, మనోధైర్యం కల్పించే మంచి న్యాయవాదిగా ఆయనకు పేరుంది. 193-4 లో నేను ఒక భూస్వామి హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న తరుణంలో పద్మనాభడ్డి మా న్యాయవాదిగా హై కోర్టులో ఉండేవారు. ఆయనను ఈ కేసులో రెక్వెస్ట్ చేసి వరంగల్ సెషన్స్ కోర్టులోమా న్యాయవాదిగా, అటు హైకోర్టులో మా న్యాయవాదిగా కొనసాగిన దివంగత ప్రముఖ న్యాయవాది మద్రాసులో పద్మనాభడ్డి సహ విద్యార్థి అయిన ప్రముఖ పౌరహక్కుల సం ఘం నాయకుడు కేజీ కన్నబీరన్ స్వయంగా చెప్పి మాట్లాడి మా కేసులో వకల్తా వేయించారు.

ఆ సందర్భంలో పద్మనాభడ్డితో ఎంతో అవినాభావ సంబంధం ఏర్పడింది. వరంగల్ జైలులో నేను స్వయంగా చూసేవాణ్ణి. నాకు స్వానుభవం ఉంది. ఎవరిని అడిగినా హైకోర్టులో మీ లాయర్ ఎవరని అడిగితే మా న్యాయవాది పద్మనాభ రెడ్డి అనే వారు. చాలా మంది నాకు తెలిసి నేను ఉన్న రెండు మూడు సంవత్సరాలలో 150 మందికి పైగా హైకోర్టులో తమ కేసును వాదించాలని, తమకు ఎవరూ లేరని, తాము ఫీజులు ఇచ్చుకోలేమని, కింది కోర్టులో జడ్జిమెంట్ కాపీలను పంపి స్తూ లేఖ రాస్తే చాలు పద్మనాభడ్డి కేసు ఫైల్ చేసేవారు. అంతేకాదు అప్పట్లో పోస్టుకార్డ్ ఉండేది. ఆ కార్డు సంబంధిత క్లయింట్ కు ఆయన స్వంత దస్తూరితో జవాబు కూడా రాసేవారు. కేసు ఎక్కడ, ఏ స్టేజీలో ఉన్నది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేసేవారు. వరంగల్ జైళ్లోనైతే ఆయనను కనిపించని దేవుడుగా మబ్బుదిక్కు చూసుకుంటూ వందలాది మంది మొక్కేవారు. ఆయన అంతపెద్ద లాయర్ అయినా చాలా లోప్రొఫైల్‌తో ఉండేవారు. ఆయన ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరితో అప్యాయం గా మాట్లాడేవారు. నన్నైతే చాలా ఇష్టపడేవారు.

హైకోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో నేను కొంతకాలం పెరోల్‌పై వచ్చాను. అప్పుడు కన్నబీరన్‌ను, ఇటు పద్మనాభడ్డి గారిని కలిసేవాడిని. ఎంతో ఆప్యాయం గా పలకరించేవారు. భోజనం చేసినవా,భోజనానికి డబ్బు లు ఉన్నాయా అని అడిగేవారు. ప్రతిసారి ఆయనను కలిసినప్పుడల్లా కన్నతండ్రి కొడుకును పలకరించిన ట్టు, కొడుకు తండ్రితో మాట్లాడినట్టు అనిపించేది. కన్నబీరన్ సార్ అయితే ఏంరా అని పలకరించేవారు. ఆ రోజులే వేరు. ఆ వ్యక్తులే వేరు. పద్మనాభడ్డి గారి వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన ఒక మహా వ్యక్తి. సింగరేణి ప్రాంతంలో అక్రమంగా ఎన్నో క్రిమినల్ కేసు ల్లో ఇరికించబడి జైళ్లలో మగ్గే కార్మికులకు, ఉద్యమకారులకు ఆయన అండగా ఉండేవారు. నేనున్నాననే భరోసాను ఇచ్చేవారు. ఆయన చాలా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికీ ఆయనను కలవడానికే సమయం దొరకని సందర్భంలో సైతం ఆయన తీసుకునే ప్రతీ కేసులో దాదాపు కోర్టుకు అటెండ్ అయ్యేవారు. మా కేసు కొట్టేయడం, మా కేసుకు సంబంధించి ఎన్నో కుటుంబాలు ఆయనను నేటికీ దేవుడుగా ఆరాధిస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో కన్నబీరన్, పద్మనాభడ్డి ఫోటోలు ఉంటా యి. కన్నబీరన్ సారే ఒకసారి నేను ఏదో మీటింగ్‌లని ఒక్కోసారి కోర్టుకు అటెండ్ కావడం కష్టమవుతుందిరా, అదే పద్మనాభడ్డి అయితే కచ్చితంగా అటెండ్ అవుతాడు. 

అందుకే ఆయన హైకోర్టులో మీకు ఉంటే మంచిదని మరీ ఫోన్ చేసి చెప్పిన వెంటనే పద్మనాభడ్డిగారు కేసు తీసుకోవడం జరిగింది. ఒక్క నయాపైసా లేకుం డా అప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద కేసుగా ఉన్న మా కేసును ఆయ న చేపట్టి అందులో నుంచి మమ్మల్ని అందరినీ విముక్తుల్ని చేసిన ఆ సందర్భం మరిచిపోలేనిది. ఇలాంటి కేసులను సింగరేణి ప్రాంతంలో ఆయన చేపట్టడం జరిగింది. ఎంతో మందికి మేలు చేశారు. ఎంతో మంది రాష్ట్రంలో న్యాయవాదులకు ఆయన ఆదర్శంగా ఉన్నారు. మంచిర్యాలలో ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్న నా తమ్ముడు సందానికి కూడా ఆయన చాలా నేర్పించారు. ఇలా కోల్‌బెల్ట్ ప్రాంతం నుంచి ఎంతోమంది న్యాయవాదులకు ఆయన తర్ఫీదు ఇవ్వడం జరిగింది. జూనియర్‌లకు ఎప్పుడూ ఆయన మనోధైర్యాన్ని నింపేవారని చాలామంది చెప్పేవారు. ప్రతి సంవత్సరం ఆయనకు నూత న సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ కార్డు పంపిస్తే తిరి గి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ కార్డు పంపేవారు. గత సంవత్సరంనా కూతురు వివాహానికి సైతం ఆయనకు కార్డు ఇచ్చినప్పుడు ఆయన సరిగ్గా పెండ్లికి ఒక్కరోజు ముందు అందేవిధంగా ఆయన దస్తూరి తో వధూవరులను ఆశీర్వది స్తూ లేఖ రాశారు. ఎంత గొప్ప మనిషి. ఇలా ఆయనతో నా కున్న అనుబంధం మరువ లేనిది.

రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆయనకు నా లాంటి క్లయింట్‌లు ఎందరో ఆయన అభిమానిం చే వారు, ఆయనను అభిమానించే వారు వేలాదిమంది. ఈ రోజు పద్మనాభడ్డి సార్ మన మధ్యలో లేరనే విషయాన్ని జీర్ణించుకోలేము. పద్మనాభడ్డి సార్ తెలంగాణ కచ్చితంగా ఏర్పడాల్సిందేనని, ఈ ప్రాంతంలో ప్రజలకు జరిగిన అన్యాయాలపైనైతేనేమి, కార్మికులకు ఇటు ఉద్యోగాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాల విషయంలోనైతేనేమి ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల విషయంలోనైతేనేమి ఆయన చాలా స్పష్టంగా ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రజలవైపే మాట్లాడేవారు. పద్మనాభడ్డి సార్ ఉద్యమకారులకు, ప్రజాస్వామ్యవాదులకు ఒక ఆదర్శం. తీరనిలోటు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఈ ప్రాంతంలోని నా లాంటి వారికి ఎంతో మందికి మరో జీవితాన్ని అందించిన వ్యక్తిగా గుండెల్లో నిండుగా ఉండిపోతారు. 

No comments:

Post a Comment